Pages

15 October 2014

సెందురూడా....... సెందురూడా by satya sreenivas



రైలు కట్టమీద సగం తెగిన సెందురూడా
ఖాళీ సీసాలో సివరి సుక్కైన సెందురూడా

ఆలైనా అమ్మవోలె సాకినోడ సెందురూడా
అయ్యబోతే అమ్మకు తెల్లసీరైనా సెందురూడా

పిడికిడంత ఆకాశంలో కోరికంత సెందురూడా
మనసులేని మనసుల్లో సగం తెగిన సెందురూడా

గుటక లేని గొంతులోన గ్రహణమైన సెందురూడా
బీడువారిన భూమిలోన రాయైన సెందురూడా

మోడువారిన జీవుల్లో కాష్టమైన సెందురూడా
నిండిన గూడులో చనుపాలైన సెందురూడా

కనురెప్పల మీద చితికిన నీటి సుక్కైనా సెందురూడా
గంజిలోన మెతుకైనా సగం తెగిన సెందురూడా

పనికోసం పట్నమొస్తే కబురు తెచ్చిన సెందురూడా
నిదుర రాక పొర్లుతుంటే జోకొట్టిన సెందురూడా

మామకోసం కూకుంటే ముద్దిచ్చిన సెందురూడా
అద్దంలో చూసుకుంటే బొట్టైనా సెందురూడా

లేనోళ్లా బతుకుల్లో అమావాస్య సెందురూడా
వున్నోళ్లా జోబుల్లో సగం తెగిన సెందురూడా

సంకురాత్రి కాలంలో ముగ్గైనా సెందురూడా
నీటివోలే  వెంటాడిన జ్ఞాపకాల సెందురూడా


మత్తులేని రోజుల్లో తొంగున్నా సెందురూడా

మోజులేని బతుకుపై తాళమైన సెందురూడా

8 October 2014

కొమరం భీమ్ - తప్పక చదవవలసిన చరిత్ర.



కొమరం భీం,పహలీ సెప్టంబర్,1940,.(1-9-1940),. తిధుల ప్రకారం ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి, .గోండులకు అత్యంత పవిత్రమైన దినం(ఈరోజు),. దోపిడికి,వంచనకు గురై తుపాకి పట్టి స్వయంపాలనకై కలలు కన్న,ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు,.. రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు,. స్థానిక షావుకారులు,అధికారులు,దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధరణమైన గోండు బాలుడు,.ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో,.హత్యచేసి,పారిపోయి,దేశమంతా తిరిగి, ఎక్కడ చూసిన అదే దుర్మార్గాలతో విసిగిపోయి,మన్నెం పోరాటి స్ఫూర్తితో ,.తిరిగి తన ప్రాంతానికే తిరిగివచ్చి పోరాటం చేసిన క్రమాన్ని తెలుసుకోవాలంటే అల్లంరాజయ్య గారు,.సాహు గారు రాసిన ఈ నవల ఒక్కసారైన చదవాలిసిందే,. ముందు మాటలో వరవరరావుగారు, ఈ పుస్తకాన్ని,.చెంఘిజ్ ఖాన్,స్పార్థకస్ లతో పోల్చినా,. దీన్ని చదవగానే నాకు గుర్తొచ్చిన పుస్తకం,. ఏడుతరాలు,.అది నేరు బానిసత్వానికి ప్రతీకగా నిలిస్తే,.,. బానిసల కంటే హీనంగా తోటివాడు ఎలా దోచుకోబడతాడో వివరించిన పుస్తకం ఇది,. ఆదివాసీ ప్రచురణలు, జోడెన్ ఘాట్ వారు 83,93 ప్రచురణల తరువాత 2004 లో (వెల: 20 రూపాయలు)ఈ పుస్తకాన్ని మళ్లీ ముద్రించారు,. తెలుగుల వెలువడ్డ మంచి పుస్తకాలలో ఒకటి, వీలైతే ఖచ్చితంగా చదవండి,.


7 October 2014

శివరాం గారి తో కాసేపు




తల్లిదండ్రులకు వందనం పాదాభివందనం,. 
కార్యక్రమం పత్రాన్ని చదివి వినిపిస్తున్న ప్రముఖ విద్యావేత్త శివరాం గారు.


వెంటాడే శిల్ప విషాదాలు - 1

ప్రకాశం జిల్లా, దొనకొండ మండలంలోని చందవరం గ్రామంలోని బౌద్దస్థూపం వద్ద ఇలా మిగిలిపోయిన క్రీ.పూ రెండో శతాబ్థం నాటి శిల్పాలు.